NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు
    తదుపరి వార్తా కథనం
    పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు
    పట్టాలపై పడుకుని నిరసనలు

    పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 28, 2023
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ మేరకు తమ సమస్యలు తీర్చాలని 18 రైతు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 రోజుల పాటు ఈ రైల్ రోకో ఆందోళన కొనసాగించనున్నారు.

    రైతుల ఉద్యమం నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. పలు రైళ్ల మార్గాలను మళ్లించింది. ఇంకొన్నింటినీ కుదించింది.

    మరోవైపు పంజాబ్ రైతులు అమృత్‌సర్‌లోని దేవిదాస్‌పురాలో 'రైల్-రోకో' నిరసన చేస్తున్నారు. రైతు కూలీల రుణాలను సంపూర్ణణంగా మాఫీ చేయాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.

    DETAILS

    సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం : రైతు నేతలు

    స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.

    మరోవైపు రైతు ఉద్యమంలో మరణించిన పంజాబీ కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తేల్చి చెప్పారు.

    వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సైతం పరిహారాన్ని అందించాలన్నారు. తక్షణమే ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని తాము పట్టిబట్టినట్లు చెప్పారు.

    MNREGA కింద ఏటా 200 రోజులు ఉపాధిని తప్పనిసరిగా కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     అమృత్‌సర్‌లోని దేవిదాస్‌పురాలో 'రైల్-రోకో' నిరసన 

    #WATCH | Punjab | Farmers, under the aegis of Kisan Mazdoor Sangharsh Committee, sit on railway tracks as they stage a 'Rail Roko Andolan' over their demands, including Committee for MSP, withdrawal of cases regarding agitation in Delhi and compensation & jobs for families of… pic.twitter.com/fy9t6XieHH

    — ANI (@ANI) September 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్

    పంజాబ్

    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారతదేశం
    పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు భగవంత్ మాన్
    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు అమృత్‌సర్
    అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్  అమృత్‌సర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025