NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి
    తదుపరి వార్తా కథనం
    ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి
    ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి

    ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 24, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు.

    ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంగళవారం దిల్లీలో కలిసి వినతి పత్రం అందించారు.

    ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా తయారైందని పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు.

    ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్ధిక అంశాలపై పురందేశ్వరి వినతిపత్రం అందజేశారు.

    ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ అన్నారు.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని అభ్యర్థించారు.

    details

    మద్యం ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం లెక్కలోకి రావట్లేదు : పురందేశ్వరి

    పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకున్న వైసీపీ, బీజేపీ పేరును దెబ్బతీసేలా ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు.

    రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల రుణాలు, గ్యారంటీలను పరిగణనలోకి తీసుకుంటూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు.

    గత 4 ఏళ్లుగా ఏపీలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం దెబ్బతిందని పురందేశ్వరి ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం లెక్కలోకి రావట్లేదని నిర్మలకు వివరించారు.

    ఇదే సమయంలో పురందేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు

    మంగళవారం చిత్తూరు జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన కోవర్టుగా అభివర్ణించారు. బీజేపీలో చంద్రబాబు కోసం ఆమె పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీజేపీ

    బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే  ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌  ఓం బిర్లా
    ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం  జనతాదళ్ (సెక్యులర్)
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025