NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్‌ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్‌ సింగ్‌ ప్రస్థానం ఇదే..
    తదుపరి వార్తా కథనం
    Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్‌ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్‌ సింగ్‌ ప్రస్థానం ఇదే..
    ఆర్బీఐ గవర్నర్‌ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్‌ సింగ్‌ ప్రస్థానం ఇదే..

    Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్‌ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్‌ సింగ్‌ ప్రస్థానం ఇదే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు.

    ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా చేసిన నిర్ణయాలతో భారత్‌ను ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా అవతరింపజేశారు.

    1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగంలో "ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించాలి" అనే ఆలోచన ప్రాచుర్యం పొందింది.

    ఆర్థిక వ్యవస్థను సరళీకరించడమే కాకుండా, భారత్‌ను ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

    వివరాలు 

    ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ

    ఆర్థికవేత్తగా,విద్యావేత్తగా మన్మోహన్ సింగ్ అనేక రంగాలలో తన ముద్రను వేశారు.

    1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పీవీ నరసింహా రావు ఆయనను ఆర్బీఐ గవర్నర్‌ నుండి నేరుగా క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చోటు కల్పించారు.

    ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు.

    ఈ సంస్కరణలతో మనం ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించడమే కాకుండా,భారత్ ఆర్థిక వృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలబడింది.

    1992లో పీవీనరసింహా రావు,మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశం ప్రపంచంలో తన స్థానాన్ని మెరుగుపర్చేందుకు మార్గం కల్పించాయి.

    2004 నుంచి 2014వరకు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నప్పుడు అనేక కొత్త సంస్కరణలు అమలు చేసారు.

    వివరాలు 

    గురువుకు తగ్గ శిష్యుడిగా..

    ఆయన పాలనలో పేదరికాన్ని తగ్గించేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

    అలాగే, పారదర్శక పాలన కోసం సమాచార హక్కు చట్టం కూడా ఆయన తీసుకొచ్చారు.

    2008లో భారతదేశం-అమెరికా అణు ఒప్పందంపై మన్మోహన్ సింగ్ సంతకం చేశారు.

    ఈ ఒప్పందం భారతదేశానికి అణు మార్కెట్లోకి ప్రవేశించే మార్గాన్ని తెరిచింది.

    ఒప్పందాన్ని వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నా, మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు, దేశ ప్రయోజనాలను ముందుండి నిలబెట్టారు.

    అలా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్‌సింగ్‌ పేరు తెచ్చుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్మోహన్ సింగ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మన్మోహన్ సింగ్

    భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు   జీ20 సదస్సు
    Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్   నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025