NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / R G Kar impasse: అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు..  సమ్మె  కొనసాగిస్తామన్నవైద్యాధికారులు  
    తదుపరి వార్తా కథనం
    R G Kar impasse: అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు..  సమ్మె  కొనసాగిస్తామన్నవైద్యాధికారులు  
    అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు

    R G Kar impasse: అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు..  సమ్మె  కొనసాగిస్తామన్నవైద్యాధికారులు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో వైద్యుల రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

    ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని, పనిని నిలిపివేస్తామని వైద్యులు సమావేశం అనంతరం ప్రకటించారు.

    ఈ చర్చలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ప్రజారోగ్య టాస్క్‌ఫోర్స్‌, 30 మంది జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల మధ్య నబన్నాలోని రాష్ట్ర సచివాలయంలో జరిగాయి. చర్చలు దాదాపు ఆరు గంటలు కొనసాగాయి.

    చర్చలు సజావుగా సాగినా,ప్రభుత్వం చర్చించిన అంశాలపై సంతకాలు చేయడానికి లేదా లిఖితపూర్వకంగా మినిట్స్ ఇవ్వడానికి నిరాకరించింది.

    ఈ వ్యవహారంపై డాక్టర్ అనికేత్ మహ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 'ప్రభుత్వ వైఖరి నిరాశకరం' అని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    ఎన్ఎస్ నిగమ్‌పై విచారణ చేపట్టాలన్న వైద్యుల డిమాండు తిరస్కరణ 

    వైద్యులు తమ డిమాండ్లను ఈమెయిల్ ద్వారా పంపుతామని, దాని ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.

    అయితే, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం,హత్యపై ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌పై విచారణ చేపట్టాలన్న వైద్యుల డిమాండును ప్రభుత్వం తిరస్కరించింది.

    సోమవారం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తొలి రౌండ్ చర్చలు నిర్వహించారు.

    ఈ సమావేశంలో భద్రతకు సంబంధించిన అంశాలు,టాస్క్ ఫోర్స్ విధివిధానాలు చర్చించారు.

    వైద్యులు రోగులకు పడకల కేటాయింపు, హెల్త్ కేర్ వర్కర్ల నియామకం, ఇతర సమస్యలు కూడా లేవనెత్తారు.

    వైద్యుల ప్రతినిధులు,కళాశాల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో పాటు విద్యార్థుల ప్రాతినిధ్యం గురించి చర్చించారు.

    ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటన పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారు తమ డిమాండ్లను వెల్లడించారు.

    వివరాలు 

    రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై సమగ్ర విచారణ 

    రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై సమగ్ర విచారణ అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

    భద్రతపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ 4-5 మంది ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం కోరగా, వైద్యులు విస్తృత ప్రాతినిధ్యాన్ని కోరారు.

    రాత్రి గస్తీ కోసం మహిళా పోలీసు అధికారులను నియమించడానికి, పానిక్ బటన్లు, హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

    చివరగా, బుధవారం జరిగిన సమావేశం అనంతరం వైద్యులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    కోల్‌కతా

    Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి  తాజా వార్తలు
    Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?  హైదరాబాద్
    Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్‌ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించిన యువ‌కుడు ఈడెన్ గార్డన్స్
    Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025