LOADING...
Raghav Chadha : రఘవ్‌ చద్ఢా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన
రఘవ్‌ చద్ఢా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన

Raghav Chadha : రఘవ్‌ చద్ఢా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దా శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో ఉన్న పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది భారతీయ జనతా పార్టీ (BJP)లో విలీనమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తీసుకున్నట్లు తెలిపారు. సహ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో చద్ఢా ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీకి చెందిన అవసరమైన మెజారిటీ సభ్యులు ఈ విలీన నిర్ణయాన్ని ఆమోదించారని, అందువల్ల అనర్హత నుంచి రక్షణ పొందేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు.

వివరాలు

దిల్లీ రాజకీయాల్లో సంచలనం

ఈ సందర్భంగా చద్ఢా మాట్లాడుతూ, "నేను నా రక్తం, చెమటతో నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన సిద్ధాంతాలు, విలువలు, మూల సూత్రాల నుంచి దూరమైంది. ఇది ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా నేను సరైన వ్యక్తిని కానీ తప్పు పార్టీలో ఉన్నాననే భావన కలిగింది. అందుకే ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరమై ప్రజలతో దగ్గరవుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Advertisement