NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు
    తదుపరి వార్తా కథనం
    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు
    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

    వ్రాసిన వారు Stalin
    Apr 19, 2023
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

    మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, అయితే కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నానని చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీని ఒక్క మాట అనడం వల్లే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మనసు ఒప్పుకోలేదన్నారు. అందుకే మళ్లీ ప్రజల ముందుకు వచ్చినట్లు చెప్పారు.

    తన స్వగ్రామం నీలకంఠాపురంలో గుడి కట్టేందుకు నాలుగేళ్లుగా రాజకీయాలకు విరామం ఇచ్చానని రఘువీరా తెలిపారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

    రఘువీరా

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం: రఘువీరా

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు. బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా తనను కాంగ్రెస్ పార్టీ నియమించిందని తెలిపారు.

    రాహుల్‌ను అవమానించినందుకు కర్ణాటక ప్రజలు బీజేపీని గద్దె దించుతారని అన్నారు.

    తన అభిమానులు చెప్పినట్లే భవిష్యత్‌లో తన రాజకీయ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

    రఘువీరా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. మడకశిర నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కర్ణాటక

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పోలవరం
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల

    కర్ణాటక

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు అత్యాచారం
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం ఐఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025