NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి
    తదుపరి వార్తా కథనం
    Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి
    గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి

    Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 18, 2024
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందారు.

    సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ చేయడంతో మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి అనిల్ మెథానియా మృతి చెందాడు.

    ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

    నవంబర్ 1న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చారు.

    రాత్రి 8:30 గంటలకు సీనియర్ విద్యార్థులు తొలి సంవత్సరం విద్యార్థులను హాస్టల్‌కు పిలిపించి పరిచయం పేరుతో ర్యాగింగ్ చేశారు.

    ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను గాయపరిచేలా మానసిక, శారీరకంగా ఒత్తిడి కలిగించారు. పాటలు పాడమని, డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేశారు.

    Details

    విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

    అనిల్‌ను మూడు గంటల పాటు నిల్చోబెట్టారు. ఈ సమయంలో అనిల్ తల తిరగడంతో కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

    15 మంది సీనియర్ విద్యార్థులపై 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్‌ల కింద కేసు** నమోదు చేశారు.

    సీసీటీవీ ఫుటేజ్ చర్యలు తీసుకుంటామని 'డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్యా' తెలిపారు.

    కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి అంటీ ర్యాగింగ్ కమిటీ చర్యలు చేపడుతోందని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపుతామని హామీ ఇచ్చింది.

    ఇలాంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతాయని, ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేధించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాలని సామాజికవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    ఇండియా

    తాజా

    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా

    గుజరాత్

    Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..  నరేంద్ర మోదీ
    PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు నరేంద్ర మోదీ
    Pankaj Udhas: భారత గజల్ ఐకాన్, దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత  బాలీవుడ్
    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ  సముద్రం

    ఇండియా

    Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం మాల్దీవులు
    Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల నాగార్జునసాగర్
    Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు! దీపావళి
    Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు  కాళేశ్వరం ప్రాజెక్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025