Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన దాడుల నేపథ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సోమవారం అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అస్సాంలోని మత గురువు అయిన శ్రీమంత శంకర్దేవ్ మఠాన్ని రాహుల్ గాంధీ సందర్శించేందుకు వెళుతుండగా.. ఆయన్ను అడ్డుకున్నారు. బటద్రవ థాన్లోని ప్రవేశించడానికి రాహుల్ గాంధీకి అనుమతి లేదని అధికారులు చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆలయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెలు ఉన్నారని, అందుకే రాహుల్ గాంధీని మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావాలని చెప్పినట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. ఆలయానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడికి ఎవరు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తారా?: రాహుల్ గాంధీ
తాను ఎలాంటి నేరం చేయలేదని, అలాంటప్పుడు తము గుడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. గుడికి ఎవరు వెళ్లాలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజుఆలయంలోకి ఒక్కరు మాత్రమే ప్రవేశిస్తారని ప్రధాని మోదీని ఉద్దేశించిన పరోక్ష విమర్శలు చేశారు. ఈ ఘటన తర్వాత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు నాగోన్లో ధర్నాకు దిగారు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ శంకర్దేవ్ మఠాన్ని సందర్శించే షెడ్యూల్ జనవరి 11నే ఖరారు చేసినట్లు, ఇందులో తమ ఇద్దరు ఎమ్మెల్యేలు నిర్వహణ కమిటీని కూడా కలిసినట్లు పేర్కొన్నారు.