Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు.. అసోం సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. మంగళవారం గౌహతిలో జరిగిన కాంగ్రెస్ యాత్రలో "వివిధ చట్టాల ఉల్లంఘన"కు సంబంధించిన కేసు "ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్") ద్వారా సమగ్రమైన, లోతైన దర్యాప్తు కోసం CIDకి బదిలీ చేయబడిందని X లో ఒక పోస్ట్లో, అస్సాం DGP GP సింగ్ తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ యాత్రను గౌహతి నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించొద్దని దానికి బదులుగా గౌహతి బైపాస్ను ఉపయోగించాలని షరతు విధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.