Page Loader
Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు 
పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు

Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛఠ్‌ పూజ,దీపావళి పండుగల నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే కోచ్‌ల సంఖ్య పెంచినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రవారం 12,500 కొత్త కోచ్‌లను జతచేసినట్లు ఆయన చెప్పారు. 108 రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచినట్లు కూడా తెలిపారు. "2024-25 సంవత్సరంలో పండగ సమయాల్లో ఇప్పటివరకు మొత్తం 5,975 రైళ్లను నడిపించనున్నామని ఇప్పటికే ప్రకటించాము. కోటి మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సౌకర్యంగా చేరుకోడంలో ఇది సహాయపడుతుంది. 2023-24 సంవత్సరంలో పండుగ సీజన్‌లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించాము" అని వైష్ణవ్ పేర్కొన్నారు.

వివరాలు 

త్వరలోనే నమో భారత్, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు 

గణేష్ ఉత్సవాల సందర్భంగా 342 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపించిన విషయం తెలిసిందే. జులైలో జగన్నాథ రథయాత్ర కోసం కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 300 కుపైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు తెలిపారు. అదనంగా, వందే భారత్, కొత్త వెర్షన్లు, నమో భారత్, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు త్వరలోనే అందుబాటులో రాబోతున్నాయి.