Page Loader
Train fare hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు

Train fare hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రైన్‌ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. నాన్‌ ఏసీ మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల టికెట్‌ ధరలు కిలోమీటరుకు 1 పైసా, ఏసీ తరగతుల టికెట్లు కిలోమీటరుకు 2 పైసాల చొప్పున పెరగనున్నాయి. రైల్వే వర్గాల సమాచారం ఆధారంగా పలు ఆంగ్ల మీడియా వెబ్‌సైట్లు ఈ వార్తను ప్రచురించాయి. దీనిపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. చాలా ఏళ్ల తర్వాత రైల్వే టికెట్ల రేట్లలో ఈ రకంగా స్వల్ప మార్పు జరగనుంది. సబర్బన్‌ రైళ్ల టికెట్ల ధరల్లో, అలాగే 500 కిలోమీటర్ల వరకు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణాలపై ఈ పెంపు వర్తించదు.

Details

తత్కాల్‌ రూల్స్‌ లోనూ మార్పులు

కానీ 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణం ఉన్న సెకండ్‌ క్లాస్‌ టికెట్లకు మాత్రం కిలోమీటరుకు 1 పైసా చొప్పున ధర పెరుగుతుంది. తత్కాల్‌ టికెట్ల విషయంలో రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ అథెంటికేషన్‌ ఉన్న వారికి తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. జులై 1 నుంచి ఈ మార్పుతో పాటు టికెట్ల ధరల పెంపు కూడా అమల్లోకి రానుంది. సీజన్‌ టికెట్లపై ప్రభావం లేదు తదుపరి నెలవారీ సీజన్‌ టికెట్ల రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.