
Rain Alert : వానలే వానలు.. తెలంగాణలో ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన ప్రకారం, నైరుతి రుతుపవనాల తిరోగమనం తెలంగాణలో ప్రారంభమైందని తెలిపారు. అదేవిధంగా కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి సుమారుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Details
చలి తీవ్రత పెరుగుతోంది
ఈ పరిణామాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు తెలంగాణలో నాగర్కర్నూల్, జోగులాంబ్ గద్వాల, వనపర్తి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇంకా తెలంగాణలో వాతావరణం మార్పుతో చలి తీవ్రత కూడా పెరుగుతోంది.
Details
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
వర్షాలు కొనసాగుతుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని హయత్ నగర్లో 21.6 డిగ్రీల సెంటిగ్రేడ్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో 22 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సుమారుగా 20 నుండి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉన్నాయి. వాతావరణ కేంద్రం తెలిపినట్టు, రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.