NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు 
    తదుపరి వార్తా కథనం
    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు 
    ప్రియురాలి భర్తను దారణంగా హత్య చేసి, 6ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు

    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు 

    వ్రాసిన వారు Stalin
    Jul 19, 2023
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 33ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.

    హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికేశాడు. ఆ శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు.

    హత్య చేసిన వ్యక్తిని మదన్‌లాల్‌గా, మృతదేహాన్ని జోగేంద్రగా పోలీసులు గుర్తించారు.

    మదన్‌లాల్‌ హత్య చేసిన తీరును చూసిన పోలీసులు అవాక్కయ్యారు.

    జోగేంద్ర మొండెంను సమీపంలోని అడవిలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

    అతని ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తల, చేతులు, కాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    జోగేంద్ర శరీర భాగాలను పాతిపెట్టిన చేసిన స్థలంలో మామిడి మొక్కలను నిందితుడు నాటినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    రాజస్థాన్

    జోగేంద్ర తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన హత్య

    జోగేంద్ర జులై 11న ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    అప్పటికే జోగేంద్ర భార్య-మదన్‌లాల్ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలుసు.

    ఈ క్రమంలో జోగేంద్ర తండ్రి మదన్‌లాల్‌పై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు.

    దీంతో పోలీసులు మదన్‌లాల్‌ను తమదైన శైలిలో విచరించగా అసలు విషయం బయటకు వచ్చింది.

    జులై 13న పోలీసులు మదన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    విచారణలో జోగేంద్ర భార్యతో తనకు సంబంధం ఉందని, అతన్ని హత్య చేసినట్లు మదన్‌లాల్ అంగీకరించాడు. నేరం ఎలా చేశాడనే వివరాలను కూడా చెప్పాడు.

    తన కొడుకును చంపడంలో ఎక్కువ మంది ప్రమేయం ఉందని తాను నమ్ముతున్నట్లు జోగేంద్ర తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసులు కోణంలో కూడా విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్

    తాజా వార్తలు

    అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ హీరోయిన్
    US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి బ్యాట్మింటన్
    జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి లక్ష్యసేన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025