NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration Card: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Ration Card: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
    సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    Ration Card: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి తరువాత రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.

    శాసనసభలో ఈ శాఖపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా తెల్ల రేషన్ కార్డులను జారీ చేయడంతోపాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం యోచన చేస్తోందని పేర్కొన్నారు.

    ఈ చర్యలను రాబోయే రెండు, మూడు నెలల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

    రాష్ట్రంలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రేషన్ బియ్యం పక్కదారి పడితే తీవ్రమైన చర్యలు చేపడతామన్నారు.

    రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యంలో తూకం తేడాలు నివారించేందుకు వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే ప్రణాళిక

    ప్రజాపంపిణీ వ్యవస్థను రద్దు చేసి, లబ్ధిదారులకు నేరుగా డబ్బు చెల్లించే ఆలోచనలేమీ ప్రస్తుతానికి లేదని, అలాగే నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే ప్రణాళికపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

    రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం అందించేందుకు పరిశీలన చేస్తున్నామని చెప్పారు.

    సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు డీలర్లకు క్వింటాకు కనీసం రూ.300 కమిషన్ అందించాలనే సూచన చేయగా, భారాస సభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు ఐరిస్ ద్వారా సరకులు పొందలేకపోతున్నారని, అటువంటి వారికి మూడో వ్యక్తి ద్వారా సరకులు అందించాలనే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025