NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం
    తదుపరి వార్తా కథనం
    High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం
    రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం

    High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది.

    కోర్టు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

    పోలీసులకు కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పి తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మంగళవారం బందరు తాలుకా పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఆరో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

    అతడిని ఏ క్షణంమైనా అరెస్టు చేసే అవకాశముందని పుకార్లు వ్యాప్తి చెందడంతో, ఆయన హైకోర్టులో లంచ్‌ మోషన్‌ ద్వారా ముందస్తు పిటిషన్‌ దాఖలు చేశారు.

    పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, పేర్ని నానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది.

    Details

    ఏ2 నిందితురాలిగా జయసుధ 

    ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధను ఏ1 నిందితురాలిగా పేర్కొని కేసు నమోదు చేయగా, ఆమె కోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్‌ మంజూరైంది.

    రేషన్‌ బియ్యం మాయం కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని మచిలీపట్నం స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించింది.

    నిందితులుగా ఉన్న వారిలో రైస్‌ గోదాం మేనేజర్‌ మానస తేజ్, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లర్‌ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావు ఉన్నారు.

    వారందరికీ నిన్న రాత్రి రిమాండ్‌ విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మచిలీపట్నం
    పేర్ని వెంకటరామయ్య/నాని

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మచిలీపట్నం

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్  పవన్ కళ్యాణ్
    Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్‌ తుపాను.. చెన్నైలో 5గురి మృతి  తుపాను

    పేర్ని వెంకటరామయ్య/నాని

    జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని ఏలూరు
    ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం ఏలూరు
    Perni Nani Wife: పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు భారతదేశం
    Perni Nani: రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు మచిలీపట్నం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025