మచిలీపట్నం: వార్తలు

జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్

జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.