NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
    భారతదేశం

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 02, 2023 | 08:08 pm 0 నిమి చదవండి
    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
    విజయవాడ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన బచ్చుల అర్జునుడు

    తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని విజయవాడ రమేశ్‌ ఆసుపత్రి నుంచి మచిలీపట్నంలోని స్వగృహానికి తరలించారు. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    బచ్చుల అర్జునుడి మృతి పై చంద్రబాబు ట్వీట్

    తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గారి మరణం అత్యంత విషాదకరం. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నాము. అర్జునుడు గారి మృతి పార్టీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/Tm6hzrlnRx

    — N Chandrababu Naidu (@ncbn) March 2, 2023

    2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

    బచ్చుల అర్జునుడు జూలై 4, 1957న ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అక్కడే తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అర్జునుడు తెలుగుదేశం పార్టీలో చేరి 1995 నుంచి 2000 వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, మరణించేవరకు అక్కడే పనిచేశారు. ఆయన మరణం టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి తీరని లోటు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఎమ్మెల్సీ
    మచిలీపట్నం

    ఆంధ్రప్రదేశ్

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు విశాఖపట్టణం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు
    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి గన్నవరం

    ఎమ్మెల్సీ

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎన్నికలు
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఆంధ్రప్రదేశ్
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్

    మచిలీపట్నం

    జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023