Page Loader
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
విజయవాడ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన బచ్చుల అర్జునుడు

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 02, 2023
08:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని విజయవాడ రమేశ్‌ ఆసుపత్రి నుంచి మచిలీపట్నంలోని స్వగృహానికి తరలించారు. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బచ్చుల అర్జునుడి మృతి పై చంద్రబాబు ట్వీట్

ఆంద్రప్రదేశ్

2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

బచ్చుల అర్జునుడు జూలై 4, 1957న ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అక్కడే తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అర్జునుడు తెలుగుదేశం పార్టీలో చేరి 1995 నుంచి 2000 వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, మరణించేవరకు అక్కడే పనిచేశారు. ఆయన మరణం టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి తీరని లోటు.