NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు
    రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు

    విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్‌ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.

    భార్యభర్తలను కారులో విజయవాడకు తరలించాలని కిడ్నాపర్లు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మార్గమధ్యంలో వ్యాపారి భార్య లక్ష్మి చాకచక్యంగా తప్పించుకున్నారు.

    వెంటనే డయల్ 100కు కాల్ చేసి జరిగినదంతా పోలీసులకు చెప్పింది. ఈ మేరకు రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు సదరు కిడ్నాపర్లను అన్నవరం వద్ద గుర్తించారు. అనంతరం విశాఖ 4వ టౌన్ ఠాణాకు తరలించారు.

    కిడ్నాప్‌ కు గల కారణాలపై విశాఖ పోలీసులు విచారించారు. విజయవాడలో చాలా మంది నుంచి శ్రీనివాస్ అప్పులు తీసుకుని విశాఖకు మకాం మార్చాడని వెల్లడైంది.

    DETAILS

    స్కామ్ లో రూ.60 లక్షల వాటా తమకు ఇవ్వాలని కిడ్నాపర్ల డిమాండ్

    2021లో బెజవాడ పటమట ఠాణాలో శ్రీనివాసరావుపై ఓ కేసు కూడా నమోదైందని, జైలుకు సైతం వెళ్లొచ్చాడని విచారణలో తెలుసుకున్నారు.

    మాకాం మార్చాక విశాఖలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు ఏజెంట్లుగా చేరినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసరావు రూ.3 కోట్లు నొక్కేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    అందులో భాగంగానే తమకు రూ. 60 లక్షలు ఇవ్వాలని గతంలో కలిసి పనిచేసిన ఏడుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారంతా కిడ్నాపర్ల అవతారం ఎత్తారు.

    విశాఖలో ఉన్న దంపతులను బెజవాడ తరలించేందుకు ప్లాన్ చేశారు. ముగ్గురు నిందితులను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మురంగా గాలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    విజయవాడ సెంట్రల్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025