English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు

    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

    వ్రాసిన వారు Stalin
    Jun 15, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.

    ఎంపీ భార్య, కుమారుడు, అతని ఆడిటర్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

    కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలో ఎంపీ కుటుంబ సభ్యులను రక్షించారు.

    తొలుత ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరద్‌లను ఒక ముఠా కిడ్నాప్ చేసి రూ.1కోటి డిమాండ్ చేసింది.

    ఎంపీ సహాయకుడు, ఆడిటర్‌జి.వెంకటేశ్వర్‌రావు డబ్బులు అందజేసేందుకు ఓ ప్రదేశానికి వెళ్లగా, అతన్ని కూడా దుండగులు కిడ్నాప్ చేశారు.

    ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కొద్ది గంటల్లోనే వారందరినీ రక్షించినట్లు వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

    వైజాగ్

    మొబైల్ సిగ్నల్స్ సాయంతో ఆచూకీ తెలుసుకున్న పోలీసులు

    రెస్క్యూ ఆపరేషన్లో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు.

    ఎంపీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కిడ్నాప్ కు గురయ్యారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఆడిటర్ కిడ్నాప్ గురించి గురువారం పోలీసులకు తెలిసింది.

    ఈ కిడ్నాప్‌కు పాల్పడిన రౌడీషీటర్ హేమంత్ కుమార్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    పోలీసులు మొబైల్ సిగ్నల్స్ సహాయంతో ఏలూరు-అమలాపురం రహదారిపై ఎంపీ కుటుంబ సభ్యులు ఉన్నట్లు గుర్తించి, రక్షించారు. ఈ ఆపరేషన్లో పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది.

    మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు వివరాలను పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ హైదరాబాద్లో ఉన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఎంపీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు  జపాన్
    Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్! సమంత
    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    ఎంపీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!  అస్సాం/అసోం
    రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం  పన్ను
    కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి  కేరళ
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  భోపాల్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025