NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 

    Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పాలనలో యువతకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించామని పేర్కొన్నారు.

    గత ఒకటిన్నర సంవత్సరాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇది దేశ చరిత్రలో ఒక గొప్ప రికార్డుగా నిలిచిందని తెలిపారు.

    ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయతీ, పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తాజాగా నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో 71,000 మందికి నియామక పత్రాలు అందించామని వివరించారు.

    దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వారి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం మరింత ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం:  ప్రధాని 

    ఉద్యోగాలు పొందిన యువత భక్తి, నిజాయతీతో దేశ సేవలో నిమగ్నమై ఉంటారని, ఈ గతి కొనసాగితే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు.

    దేశ అభివృద్ధి పూర్తిగా యువతపై ఆధారపడి ఉందని, కానీ గత ప్రభుత్వాలు యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో దేశం వెనకబడ్డదని విమర్శించారు.

    తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు, మేక్‌ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా వారికి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.

    ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని, అంతరిక్షం, రక్షణ, మొబైల్ తయారీ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని చెప్పారు.

    వివరాలు 

    ఎన్డీఏ హయాంలో వెనుకబడిన తరగతుల రిక్రూట్‌మెంట్ 27 శాతం

    రోజ్‌గార్‌ మేళాలో ఈసారి నియామక పత్రాలు పొందిన వారి మధ్య ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండడం గర్వకారణమని, మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.

    అన్ని ప్రాంతాల యువతకు అందుబాటులో ఉండేందుకు 13 భారతీయ భాషల్లో రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ప్రకటించారు.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈసారి అందించిన 71,000 నియామకాల్లో 29 శాతం ఓబీసీలు, 15.8 శాతం షెడ్యూల్ కులాలు, 9.6 శాతం షెడ్యూల్ తెగలు ఉన్నారని వెల్లడించారు.

    ఎన్డీఏ హయాంలో వెనుకబడిన తరగతుల రిక్రూట్‌మెంట్ 27 శాతం పెరిగిందని, ఇది గత ప్రభుత్వాలతో పోలిస్తే ఒక ప్రధాన మార్పు అని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    Sawji Dholakia: సావ్జీ ఢోలాకియా ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ గుజరాత్
    Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు దీపావళి
    Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం ఇండియా
    Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025