NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
    టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

    Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది.

    ఈ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు లో ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థించింది.

    హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

    అంగళ్లులో జరిగిన ఘర్షణలో పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

    దీంతో హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది.

    Details

    ఆరు పిటీషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు

    అంగళ్లు కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఈ పిటిషన్‌ను అనిరుద్ధ బోస్, జిస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కాగా, చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు తలెత్తాయి.

    ఈ గొడవలకు చంద్రబాబు కారణమని ఆరోసిస్తూ, చంద్రబాబుతో పాటు దాదాపుగా 20 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు.

    ఏపీ ప్రభుత్వం వేసిన మొత్తం ఆరు పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  జ్యోతి మల్హోత్రా
    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా
    KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

    సుప్రీంకోర్టు

    రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ డివై చంద్రచూడ్
    'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం డివై చంద్రచూడ్
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సెబీ
    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  మసీదు

    ఆంధ్రప్రదేశ్

    ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని చంద్రబాబు నాయుడు
    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్  చంద్రబాబు నాయుడు
    అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025