Page Loader
Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు
నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు

Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడికి సంబంధించి నమోదైన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగం సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయనను వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చిన కోర్టు, నందిగం సురేశ్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని సూచించింది. ఈ కేసులో ఆదివారం ఉదయం నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, మొదటగా మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు.

వివరాలు 

 భారీ సంఖ్యలో కోర్టు ప్రాంగణానికి సురేశ్ అనుచరులు

అనంతరం సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. కోర్టు వద్ద ఈ విచారణ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నందిగం సురేశ్ అనుచరులు భారీ సంఖ్యలో కోర్టు ప్రాంగణానికి చేరుకోవడంతో, వారికి అక్కడికి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. భద్రతా కారణాల చేత ఇతరులను కోర్టు పరిసరాలకు అనుమతించలేదు.