NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్ 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్ 
    Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్

    Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్ 

    వ్రాసిన వారు Stalin
    Nov 19, 2023
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.

    అయితే రోజురోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. రెస్క్యూ అధికారులు బహుముఖ వ్యూహంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) బృందం, సైట్‌లోని నిపుణుల బృందం దృష్టి సారించాయి.

    ఈ క్రమంలోనే కార్మికులను రక్షించడానికి 5ప్లాన్స్‌ను ఏకకాలంలో అమలు చేయాలని కేంద్ర, నిపుణుల బృందాలు నిర్ణయించాయి.

    అందులోనే భాగంగానే కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్‌ను అమలు చేయడంపై ఫోకస్ పెట్టారు.

    సొరంగానికి సిల్క్యారా వైపు, బార్కోట్ వైపు రోడ్డును ఏర్పాటు చేయడం, సొరంగం పై నుంచి డ్రిల్లింగ్ చేడడం, లంబ కోణంలో డ్రిల్లింగ్ చేయడం వంటివి అధికారుల ప్లాన్స్‌లో భాగంగా ఉన్నాయి.

    సొరంగం

    రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

    సొరంగం పై నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేసే దిశగా రెస్క్యూ సిబ్బంది పనిని ప్రారంభించారు.

    బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఆదివారం మధ్యాహ్నానికి సిల్క్యారా టన్నెల్‌కు కొత్త రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

    సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి ఇది మరొక మార్గాన్ని అందిస్తుందని అధికారులు నమ్ముతున్నారు.

    శుక్రవారం నుంచి ఆపివేయబడిన రెస్క్యూ మిషన్‌ను తిరిగి ప్రారంభించారు.

    రెస్క్యూ మిషన్‌లో సహాయం కోసం అధికారులు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపుతున్నారు.

    ఇప్పటికే అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు, ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌ను నిపుణుల బృందం సంప్రదించింది.

    కార్మికులను రక్షించేందుకు తాను భారత్‌కు వెళుతున్నట్లు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    తాజా వార్తలు

    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  మంచు విష్ణు
    Children's Day Special: దేశంలో అతిపిన్న వయస్కులైన సీఈఓలు వీరే.. 10ఏళ్లకే అద్భుతం చేశారు  బాలల దినోత్సవం
    RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా..  సలార్
    Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్  దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025