Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ సతీమణి సతీమణి ఈ మేరకు శనివారం రాత్రి చిరంజీవి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మెగాస్టార్కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్తో రేవంత్ రెడ్డి కొద్దిసేపు సంభాషించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డీకే అరుణ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.