
Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది: రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత న్యాయవ్యవస్థపై తనకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి ధృవీకరించారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంజూరైన బెయిల్పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై స్పందిస్తూ రేవంత్ శుక్రవారం 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు.
"నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు అభిప్రాయపడ్డారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై నేను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉంది. రాజ్యాంగం, దాని విలువలను నేను గౌరవిస్తాను. ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతంగా భావిస్తాను," అని రేవంత్ స్పష్టం చేశారు.
వివరాలు
రేవంత్ పై సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం
దిల్లీ మద్యం కేసులో కవితకు మంజూరైన బెయిల్పై ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం, "ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన వ్యాఖ్యలు అవేనా? మేం రాజకీయపార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?" అని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్
I have the highest regard and full faith in the Indian Judiciary. I understand that certain press reports dated 29th August, 2024 containing comments attributed to me have given the impression that I am questioning the judicial wisdom of the Hon’ble Court.
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2024
I reiterate that I am…