NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్
    తదుపరి వార్తా కథనం
    Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్
    రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్

    Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2024
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

    దీని కోసం కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. గోషా మహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దాదాపు 32 ఎకరాల స్థలం ఉంది.

    పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

    అక్కడే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నారు.

    Details

    అభివృద్ధి పనులపై సమీక్షా

    రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ప్రణాళికతో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం సచివాలయంలో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

    19 పనుల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

    50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలన్నారు.

    ప్రస్తుతం గోషా మహల్‌లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అక్కడికి తరలించేలా చూడాలన్నారు.

    Details

    నర్సింగ్ కాలేజీ భవనాలను ఏడాదిలోగా పూర్తి చేయాలి

    తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే ఆస్పత్రి పనులను వేగవంతం చేసి, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు.

    మహిళా స్వయం సహాయక సంఘాలకు పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

    హైదరాబాద్ లోని శిల్పారామం పక్కనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    తెలంగాణ

    Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి
    Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల  భారతదేశం
    Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం భారతదేశం
    Telangana: నెమలి కూరను వండి.. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసిన సిరిసిల్ల వాసి  భారతదేశం

    రేవంత్ రెడ్డి

    Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు  తెలంగాణ బడ్జెట్
    Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు  తెలంగాణ
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన  రైతుబంధు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025