NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి

    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 

    వ్రాసిన వారు Stalin
    Feb 04, 2024
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర 'పద్మ' అవార్డులను పొందిన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలను అందజేస్తామని ప్రకటించారు.

    అలాగే, ప్రతినెలా వారికి రూ.25వేల పింఛన్ కూడా అందజేస్తామని చెప్పారు. దిల్లీకి వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్దదిక్కు అన్నారు.

    పున్నమినాగులో చిరంజీవి ఏ స్థాయిలో నటించారో.. ఇప్పుడు కూడా అదేస్థాయిలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమం అన్నారు.

    తెలంగాణ

    గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం సముచితం: చిరంజీవి

    తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదని ఈ సందర్భంగా చిరంజీవి స్పందించారు.

    అయితే ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.

    పద్మ అవార్డు గ్రహీతలకు ఈ విధంగా ప్రభుత్వం సన్మానం చేయడం ఇదే మొదటిసారి అన్నారు. తెలుగు భాషను దిల్లీ స్థాయిలో నిలబెట్టిన వారిలో వెంకయ్య నాయుడు ఒకరని చిరంజీవి అన్నారు.

    అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. పద్మ విభూషణ్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

    పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన రేవంత్ రెడ్డిని వెంకయ్య అభినందించారు.

    రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవిని తెలుగు కళామతల్లికి మూడో కన్నుగా వెంకయ్య అభివర్ణించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సన్మాన కార్యక్రమం

    Watch Live: Hon’ble Chief Minister Sri @Revanth_Anumula participating in Felicitation of Padma Awardees at Shilpakala Vedika, Hyderabad. #PadmaAwards https://t.co/7Epgy0ob8n

    — Telangana CMO (@TelanganaCMO) February 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    పద్మశ్రీ పురస్కారాలు
    పద్మవిభూషణ్
    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే ఇంటర్
    Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి అమిత్ షా
    TS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ  టీఎస్ఆర్టీసీ
    New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు  ఆంధ్రప్రదేశ్

    పద్మశ్రీ పురస్కారాలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్
    Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్

    పద్మవిభూషణ్

    Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి

    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు పద్మ భూషణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025