LOADING...
Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చరిత్ర, సంస్కృతిపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరి పయనంలో ఈ ఆలయం తప్పనిసరిగా ఉండాల్సినదే. తాజాగా ఈ ఆలయం దేశవ్యాప్తంగా మరోసారి దృష్టిని ఆకర్షించింది. జూలై 27న రాజేంద్ర చోళుడు I జయంతిని పురస్కరించుకుని జరిగే 'ఆది తిరువతిరై'పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయంలో పూజలు చేశారు. పారంపర్య దుస్తుల్లో ఆలయ ప్రాంగణానికి వచ్చిన ప్రధాని మోదీ, సంప్రదాయ ఆచారాల్లో పాల్గొని పూర్ణకుంభ ఆహ్వానాన్ని స్వీకరించారు. ఆయన సందర్శన వల్ల చోళుల కాలం నాటి ఈ అపురూప శిల్పకళా సంపదపై మళ్లీ వెలుగు పడింది. ఆధ్యాత్మికత, చరిత్ర, కళలపట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం.

Details

 గంగైకొండ చోళపురం ఆలయం ప్రత్యేకతలు 

తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయం ఎంత గొప్పదో, గంగైకొండ చోళపురం ఆలయం కూడా అంతే స్థాయిలో గంభీరంగా ఉంటుంది. 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు I ఉత్తర భారత విజయయాత్ర విజయసూచకంగా, గంగా జలాలను దక్షిణానికి తీసుకువచ్చిన పురస్కారంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది చోళుల నిర్మాణ నైపుణ్యానికి శిఖరరూపమే. శిల్పకళా అద్భుతం ఈ ఆలయ శిల్పాలలో నిక్షిప్తమైన నైపుణ్యం, దాని విమానం నిర్మాణ వైశిష్ట్యం, భారీ నంది విగ్రహం వంటి అంశాలు శిల్పకళలు మైమరచేలా చేస్తాయి. ఆధ్యాత్మిక వాతావరణం నిత్య పూజలు కొనసాగుతున్న ఈ ఆలయం పండుగ వేళల్లో భక్తిని, శాంతిని అందించే పవిత్ర ప్రదేశంగా మారుతుంది

Details

సాంస్కృతిక అనుభవం 

ఆది తిరువతిరై వంటి పండుగల సందర్బంగా ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా తమిళనాడులోని సంప్రదాయ జీవనశైలిని నేరుగా అనుభవించవచ్చు. ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం ఉదయం, సాయంకాల వేళల్లో ఆలయ రాతిగోడలపై పడే ప్రకాశం ఫొటోగ్రాఫీ ప్రేమికులకు అసలైన కళాత్మక ఆనందాన్ని అందిస్తుంది. అక్కడికి ఎలా వెళ్లాలి? తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఉన్న గంగైకొండ చోళపురం ఆలయం, తంజావూరు నుండి సుమారు 70 కిలోమీటర్లు, కుంభకోణం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. సమీప పట్టణాల వరకు రైలులో వెళ్లి అక్కడినుండి ట్యాక్సీ లేదా ఆటో ద్వారా సులభంగా చేరుకోవచ్చు.