Page Loader
Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన
క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన

Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాలకు మళ్లించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఆదేశించింది. ఈ విషయాన్ని డీఓపీటీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజన అనే ఐఏఎస్‌ అధికారులు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. తెలంగాణలో కొనసాగేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌, ఆమ్రపాలి కోరారు.

Details

మంగళవారం విచారణ

అయితే ఏపీ పరిధిలోనే కొనసాగాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన కోరారు. ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి ఉన్నారు. ఐపీఎస్‌ అధికారులు అంజనీకుమార్, అభిలాష్‌ బిస్త్, అభిషేక్‌ మహంతి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్‌ అధికారుల్లో సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ తిరస్కరించింది. దీంతో వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగనున్నారు.