NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌
    ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్

    Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ తాహిర్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు మంగళవారంనాడు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.

    ఈ మేరకు ప్రతిరోజూ ఆయన పోలీసు ఎస్కార్ట్ తో జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటలపాటు ప్రచారం చేయవచ్చు.

    జనవరి 29 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ వెసులుబాటు ఇచ్చారు. కస్టడీ పెరోల్ ప్రకారం, జైలు వ్యాను, పోలీసు సిబ్బంది, ఎస్కార్ట్ వాహనానికి అయ్యే ఖర్చులు తాహిర్ హుస్సేన్‌నే భరించాలని కోర్టు ఆదేశించింది.

    రోజుకు సుమారు 2 లక్షల రూపాయల చొప్పున రెండు రోజుల అడ్వాన్స్ డిపాజిట్ కూడా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

    వివరాలు 

    కారవాల్ నగర్‌లోని ఇంటికి వెళ్లకూడదని కోర్టు సూచన

    తాహిర్ హుస్సేన్, ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడిగా, తన పార్టీ కార్యాలయానికి వెళ్లవచ్చని, తన నియోజకవర్గం ఓటర్లతో సమావేశాలు నిర్వహించవచ్చని కోర్టు ఆదేశించింది.

    అయితే, తన సొంత ఇంటి అయిన కారవాల్ నగర్‌లోని ఇంటికి వెళ్లకూడదని సూచించింది.

    అదేవిధంగా, తనపై ఉన్న పెండింగ్ కేసులపై మాట్లాడరాదని కూడా కోర్టు షరతు విధించింది.

    తాహిర్ హుస్సేన్ సుప్రీంకోర్టును మంగళవారంనాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కస్టడీ పెరోల్ ఇవ్వాలని కోరాడు.

    ఎన్నికల ప్రచారం ముగిసేందుకు కేవలం నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నందున, తన క్లయింట్‌ను పోలీసు కస్టడీలో ప్రచారం చేసేందుకు అనుమతించాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ అగర్వాల్ అభ్యర్థించారు.

    వివరాలు 

    ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు

    కానీ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈ విజ్ఞప్తిని తిరస్కరించాలనుకుంటూ, కోర్టు ఉపశమనం ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరూ జైలు నుంచి నామినేషన్ వేస్తారని చెప్పారు.

    ముందుగా, జనవరి 22న హుస్సేన్ చేసిన తాత్కాలిక బెయిల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది.

    ద్విస్వభ్య ధర్మాసం పరస్పర విరుద్ధమైన తీర్పు ఇవ్వడంతో ఆయనకు బెయిల్ లభించలేదు.

    అంతకు ముందు, జనవరి 14న ఢిల్లీ హైకోర్టు ఆయనకు నామినేషన్ వేసేందుకు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.

    2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది అకింత్ శర్మ మరణానికి సంబంధించి హుస్సేన్ నిందితుడిగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సుప్రీంకోర్టు

    Supreme Court: రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక సూచనలు.. రూల్స్ మార్పులపై ముందే చెప్పాలని ఉద్ఘాటన డివై చంద్రచూడ్
    Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు డివై చంద్రచూడ్
    Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం   భారతదేశం
    SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025