గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, సలోమి అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొండపాడు పీఎఫ్ ప్రత్తిపాడు మండలానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్లో వెళ్తుండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గాయాలైన వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 40 మంది
క్షతగాత్రులను మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ప్రమాదానికి గురైన ట్రాలీలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ చికిత్స అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన పలువురు శుభకార్యాల నిమిత్తం చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 40 మంది ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.