
Palnadu: విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగల దాడి యత్నం.. గాల్లో పోలీసుల కాల్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. చోరీ యత్నాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, వారిని భయపెట్టేందుకు గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరుగెత్తారు. ఇటీవల పిడుగురాళ్ల ప్రాంతంలో వరుసగా రైళ్లలో చోరీల ఘటనలు జరుగుతున్నట్లు సమాచారం.
Details
నిందితుల కోసం దర్యాప్తు
బీహార్, మహారాష్ట్రలకు చెందిన గ్యాంగులు ఈ దొంగతనాల్లో పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారని వారు పేర్కొన్నారు. గతవారం రోజుల వ్యవధిలో రెండు సార్లు దొంగతనానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ రైలులో తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో పోలీసులు తక్షణ చర్యగా కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ముఠా వెనుక ఉన్న నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానాలకు చేరుకునేలా పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.