NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం
    రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

    Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    08:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

    ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కైలాష్‌ భీంరావు భవర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక లేఖను పంపించారు.

    రీజినల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (ఆర్‌ఈసీ) అనుమతులను జారీ చేయడంతో ఈ ప్రాజెక్టు త్వరగా ముందుకు సాగనుంది.

    ఈ అనుమతుల కింద, మెదక్‌ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, యాద్రాద్రి జిల్లాలో 8.511 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం ఉపయోగించేందుకు అనుమతులు ఇచ్చారు.

    ఈ భూములను భారత్‌మాల పరియోజన ఫేజ్‌-1 కింద పీఐయూ (ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌), గజ్వేల్‌ పేరుతో గుర్తించారు.

    వివరాలు 

    డీపీఆర్‌ ఇప్పటికే సమర్పణ 

    అటవీ అనుమతులు వచ్చిన తర్వాత, ఎన్‌హెచ్‌ఏఐ నుంచి టెక్నికల్‌ అప్రూవల్‌ వచ్చేలా మార్గం సుగమమవుతోంది.

    డిసెంబరు లేదా జనవరిలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

    ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం 161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి, చౌటుప్పల్‌ ప్రాంతాల మీదుగా నిర్మించనున్నారు.

    ఈ ప్రాజెక్టును ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 72.35 హెక్టార్లు అటవీ భూమిగా గుర్తించారు.

    ఈ భూముల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం జులై 26న కేంద్రానికి అభ్యర్థన పంపింది, దీనిపై కేంద్రం అంగీకారం తెలిపింది.

    వివరాలు 

    త్వరలో టెండర్లు 

    ప్రాజెక్టు సమర్పణలో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐకు ఇప్పటికే డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు) సమర్పించారు.

    ఇందులో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు, అండర్‌పాసులు, కల్వర్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు.

    ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అనుమతులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ 90 శాతం పూర్తయిందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు.

    ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఉత్తర తెలంగాణకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    తెలంగాణ

    Kavach System: రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ రైలు ప్రమాదం
    Medak: తెలంగాణలో చలి తీవ్రత.. మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.2°C చలికాలం
    Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా రేవంత్ రెడ్డి
    PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025