NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు
    ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు

    Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్‌ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 27, 2025
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద కల్పించే 25 శాతం ప్రవేశాల ఫీజుల విషయంలో నిర్ణయ కమిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

    ఈ ఫీజులను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఇటీవల కొందరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను కలుపుకొని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

    ఈ కమిటీ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సమావేశమైంది.

    ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి. శ్రీనివాసరావు హాజరయ్యారు.

    కొన్ని పాఠశాలల యాజమాన్యాల అభ్యర్థనల మేరకు కొన్ని ఫీజుల్లో స్వల్ప మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

    ఈ కమిటీ ఫీజులను నిర్ణయించడంలో పాఠశాలల స్టార్ రేటింగ్‌ను ఆధారంగా తీసుకుంది.

    వివరాలు 

    ఫీజుల నిర్మాణం 

    స్టార్-1లో 95 పాఠశాలలు, స్టార్-2లో 3,420, స్టార్-3లో 5,730, స్టార్-4లో 708 పాఠశాలలు ఉన్నట్లు గుర్తించారు. స్టార్-5 రేటింగ్ కలిగిన ఒక్క పాఠశాల కూడా లేదని స్పష్టం చేశారు.

    వీటి ప్రకారం ఫీజుల నిర్మాణం ఇలా ఉంటుంది:

    స్టార్-1: మొదటి తరగతికి ₹7,500, ఐదో తరగతికి ₹10,500

    స్టార్-2: మొదటి తరగతికి ₹10,000, ఐదో తరగతికి ₹12,000

    స్టార్-3: మొదటి తరగతికి ₹12,000, ఐదో తరగతికి ₹13,900

    స్టార్-4: మొదటి తరగతికి ₹15,000, ఐదో తరగతికి ₹17,000

    ఈ ఫీజు మొత్తాలను నేరుగా ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని డైరెక్టర్ విజయరామరాజు హామీ ఇచ్చారు.

    వివరాలు 

    కొన్ని యాజమాన్యాల అభ్యంతరం

    ఫీజులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ అభ్యంతరాలను తెలియజేశాయి.

    ప్రభుత్వ పాఠశాలలు ఒక్కో విద్యార్థిపై ఎంత ఖర్చు చేస్తున్నారో అదే మొత్తాన్ని గరిష్ఠంగా ఫీజుగా నిర్ణయించి తమకు చెల్లించాలని కొన్ని యాజమాన్యాలు సూచించాయి.

    ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఖర్చు తక్కువగా ఉంటే, ఆయా ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న తక్కువ ఫీజే చెల్లించాలని డిమాండ్ చేశాయి.

    గత ప్రభుత్వ హయాంలో ఆర్టీఈ కింద ప్రవేశించిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు చెల్లింపులు జరగలేదని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసిందని ఫెడరేషన్ ఆఫ్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్, అపుస్మా, ఇస్మా, యూపీఈఐఎఫ్ వంటి పాఠశాల సంఘాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

    వివరాలు 

    కొన్ని యాజమాన్యాల అభ్యంతరం

    అలానే, "2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీఈ ఫీజుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

    బకాయిలు చెల్లించకపోతే ప్రైవేట్ పాఠశాలలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి.

    ప్రభుత్వం న్యాయం చేయకపోతే దేశంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఇది విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

    ఈ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని స్పష్టంగా హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ
    Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్‌ నుంచే పిక్సెల్‌ ఫోన్లు, వాచ్‌లు విక్రయం గూగుల్
    Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు
    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    Maternity Leave: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. మెటర్నిటీ లీవ్స్‌ పెంచుతూ నిర్ణయం  భారతదేశం
    Sujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం బీజేపీ
    AP Rains: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు భారీ వర్షాలు
    CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025