Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురుజగ్గీ వాసుదేవ్ సర్జరీ తరువాత వేగంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు ఎక్స్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. ఆసుపత్రి బెడ్ పై తలకు బ్యాండేజ్ తో ఎంతో కూల్ గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరే ముందు సద్గురు మెదడులో బహుళ రక్తస్రావంతో బాధపడ్డారని ప్రకటన పేర్కొంది. గతవారం దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో సద్గురుకు బ్రెయిన్ సర్జరీ అయిన సంగతి తెలిసిందే.