NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!
    శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!

    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం జలాశయ స్పిల్‌వే దిగువ భాగంలో ఏర్పడిన ప్లంజ్‌ పూల్‌ (పెద్ద లోతైన గొయ్యి) మరింత విస్తరిస్తుండటంతో జలాశయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

    ఈ ప్లంజ్‌ పూల్‌ ప్రాజెక్టు పునాది కన్నా లోతుకు చేరినట్టు నిపుణులు గుర్తించారు. ప్రత్యేకించి ఏప్రాన్‌ స్థాయి కన్నా దిగువన ఈ గొయ్యి కొనసాగుతూ ఉండటం ప్రమాద సంకేతంగా చెబుతున్నారు.

    ప్లంజ్‌ పూల్‌ విస్తరణను అడ్డుకోవడానికి గతంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలోని బృందం ఇటీవల ప్రాజెక్టును పరిశీలించింది.

    Details

    తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫార్సులు

    తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పలు సిఫారసులు చేసింది.

    అయితే గతంలో 2022, 2024 సంవత్సరాల్లో చేసిన సూచనలను ఇప్పటికీ అమలు చేయకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    భద్రతా పనుల్లో ఆలస్యం జగన్‌ ప్రభుత్వం కాలంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం.

    ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు పరిస్థితిపై అథారిటీకి ఫిర్యాదు చేయగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా అథారిటీ ఛైర్మన్‌ను ప్రాజెక్టు సందర్శించాలని కోరింది.

    త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖతో సమావేశం జరపనుండగా, శ్రీశైలంలోని పరిస్థితి ప్రధానాంశంగా చర్చించనున్నారు.

    Details

    ప్లంజ్‌ పూల్‌ లోతు ప్రమాద సంకేతమా? 

    శ్రీశైలం ఏప్రాన్‌ స్థాయి 169 మీటర్ల వద్ద ఉండగా, ప్లంజ్‌ పూల్‌ లోతు 122 మీటర్ల వరకు నమోదు అయ్యింది.

    ఇది ప్రాజెక్టు ఫౌండేషన్‌లో అత్యంత లోతైన స్థాయి అయిన 134 మీటర్ల కన్నా 12 మీటర్ల దిగువకు చేరింది.

    ఇది ఇప్పుడు విస్తరిస్తూ ఉండటంతో, భవిష్యత్‌లో ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటి తీవ్ర ప్రవాహం వల్లనే ఈ కోత పెరుగుతోందని చెబుతున్నారు.

    1984 నుంచే ప్లంజ్‌ పూల్‌ సమస్యను గుర్తించిన అధికారులు, 1985-87మధ్య కాలంలో ప్లంజ్‌ పూల్‌ విస్తరణను అడ్డుకోవడానికి 62 స్టీల్‌ సిలిండర్లను కాంక్రీటుతో నింపి ఏర్పాటు చేశారు.

    ఇప్పటివరకు అందులో 12 పూర్తిగా, 8 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పటివరకు వీటి పునర్నిర్మాణం చేపట్టలేదు.

    Details

    ఇంకా చాలా పనులు పెండింగ్‌ 

    ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన ఎడమ, కుడి కొండ గట్ల వాలును తగ్గించేందుకు 'క్రీటింగ్‌' చేయాల్సిన అవసరం ఉంది. ఏప్రాన్‌ పైభాగానికి రహదారి నిర్మాణం కూడా ఆవశ్యకంగా ఉందని నిపుణులు సూచించారు.

    అయితే ఫండింగ్‌ కొరత వల్ల అన్ని పనులు ఆలస్యమవుతున్నాయి. డ్రిప్‌ పథకం కింద రూ.200 కోట్లతో తొలి విడత పనులు చేపట్టాలన్న ప్రతిపాదన ముందుకెళ్లలేదు.

    2024లో రూ.14.7 కోట్ల మంజూరు ప్రకటన చేసినా ఇప్పటివరకు కేవలం రూ.2 కోట్లే విడుదలయ్యాయి.

    ప్రస్తుతం కొంతమేర పనులు కొనసాగుతున్నా, కీలక పనుల కోసం తగిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన పాకిస్థాన్
    Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా! డొనాల్డ్ ట్రంప్
    Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం రామ్ చరణ్

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం

    ఆంధ్రప్రదేశ్

    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
    Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ
    Summer Holidays: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త - ఈసారి వేసవి సెలవులు ఎక్కువే!  భారతదేశం
    Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్‌.. మే 6 వరకు రిమాండ్ పొడిగింపు! వల్లభనేని వంశీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025