NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత
    తదుపరి వార్తా కథనం
    Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత
    బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత

    Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 08, 2024
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    శ్రీలంక, బంగ్లాదేశ్‌ తరహా పరిస్థితి భారత్‌లోనూ వస్తుందని ఆయన అన్నారు.

    షేక్ హ‌సీనా ఇంట్లోకి ప్ర‌జ‌లు ఎలా ప్ర‌వేశించారో, అప్పుడు నరేంద్ర మోదీఇంట్లోకి కూడా ప్రవేశిస్తారని వ‌ర్మ అన్నారు. వర్మకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

    సజ్జన్ సింగ్ వర్మ ఈ వివాదాస్పద వ్యాఖ్య చేసినప్పుడు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీతో సహా పలువురు నేతలు వేదికపై ఉన్నారు.

    ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి, పన్నుల పెంపు ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పెద్ద ప్రదర్శన నిర్వహించింది.

    ఈ ప్రసంగంలో సజ్జన్ సింగ్ వర్మ భారత్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోల్చారు.

    వివరాలు 

     సల్మాన్‌ ఖుర్షీద్‌ కూడా ఇదే తరహా ప్రకటన 

    సజ్జన్ సింగ్ వర్మ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరు.మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు.

    మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ కూడా ఇదే తరహా ప్రకటన చేశారు.

    బంగ్లాదేశ్‌లో జరుగుతున్నదే భారత్‌లో కూడా జరుగుతుందని ఖుర్షీద్ మంగళవారం అన్నారు.

    ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఖుర్షీద్ మాట్లాడుతూ.. పైకి అంతా బాగానే అనిపించినా, బంగ్లాదేశ్‌ లాంటి పరిస్థితి భారత్‌లో కూడా రావచ్చని అన్నారు.

    రిజర్వేషన్లకు సంబంధించి బంగ్లాదేశ్‌లో గత రెండు నెలలుగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరగడం గమనార్హం.

    షేక్ హసీనా సోమవారం అకస్మాత్తుగా ఆ పదవికి రాజీనామా చేసి విమానంలో భారత్‌కు పారిపోయారు. అనంతరం ఆమె నివాసంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు భారీగా లూటీ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే .. 

    Soon people will attack the PM House, capture it and thrash Narendra Modi - Congress leader Sajjan Verma

    This is how they start and step by step, keep filling the hate... Government should be proactive and arrest these terrorist before it's late pic.twitter.com/Mm9sreERkx

    — A K ಎ ಕೆ 🇮🇳 (@AK_Aspire) August 7, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    మధ్యప్రదేశ్

    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది  భారతదేశం
    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు  భారతదేశం
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025