NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
    తదుపరి వార్తా కథనం
    Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
    బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..

    Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంభాల్ హింసకు సంబంధించిన తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఆడియో క్లిప్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.

    ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లోని జామా మసీదు సమీపంలో అధికారులు, పోలీసులు సర్వే నిర్వహించడానికి వెళ్లినపుడు ఆందోళనకారుల భారీ గుంపు రాళ్ల దాడి చేసారు.

    ఈ ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు.

    ఈ ఘటనలో మసీదు సమీపానికి పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఎలా చేరుకున్నారో, ఆయుధాలు ఎలా సేకరించారో అనే అంశాలపై ఆడియో క్లిప్‌లో వివరాలు ఉన్నాయి.

    వివరాలు 

    25 మంది అరెస్ట్, 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు

    దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఈ ఆడియో క్లిప్ దొరికింది.

    ఆడియోలో, ఒక గుర్తుతెలియని వ్యక్తి, మొఘల్ కాలపు షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు.

    "సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్, మేరే భాయ్ కా ఘర్ హై" అని ఆ వ్యక్తి చెప్పాడు, అంటే ఆయుధాలతో మసీదు దగ్గరికి రా, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది.

    ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

    సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌,స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నారు.

    వివరాలు 

    బార్క్ షాహీ జామా మసీదు సమీపంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు

    ఈ హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు సమీపానికి వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనబడింది.

    అలాగే, షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉన్నదని,ఈ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

    కోర్టు ఆదేశాలు మేరకు మసీదు సర్వేను నిర్వహించేందుకు అధికారులు పంపించబడ్డారు.ఆదివారం, మసీదు సమీపంలో ఆందోళనకారులు సర్వే బృందంపై దాడికి దిగారు.

    హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి,మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని తెలిపారు.

    వివరాలు 

    విధ కోణాల్లో దర్యాప్తు 

    ఈ చరిత్ర ఆధారంగా హిందూ పక్షం"బాబార్ నామా","ಐన్ ఏ అక్బరీ" వంటి చారిత్రక గ్రంథాలను కోర్టుకు సమర్పించింది.

    మరొక వైపు,ముస్లిం పక్షం 1991 సంవత్సరం ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం,1947 ఆగస్టు 15 తర్వాత ఎలాంటి మార్పులు జరగకూడదని పేర్కొంది.

    ఈ సంఘటనపై ఇంకా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్ ఇండియా
    Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు రైలు ప్రమాదం
    Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం ఇండియా
    Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025