NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanjay Raut: ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్
    తదుపరి వార్తా కథనం
    Sanjay Raut: ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్
    ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్

    Sanjay Raut: ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 20, 2025
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాజకీయాల్లో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబంలోని ఇద్దరు కీలక నేతలు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఇటీవల ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు బలం చేకూర్చాయి. రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమం అని స్పష్టం చేస్తూ.. ఉద్ధవ్‌తో తనకు ఉన్న విభేదాలు తక్కువవేనని పేర్కొన్నారు.

    అవసరమైతే వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమని రాజ్‌ అభిప్రాయపడ్డారు.

    అయితే ఈ వ్యాఖ్యలపై శివసేన (ఠాక్రే గ్రూప్) ప్రధాన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇది కేవలం భావోద్వేగాల్ని ప్రతిబింబించే మాటలేనని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.

    Details

    వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు

    అయినా భవిష్యత్తులో రాజకీయ కూటమి ఏర్పడే అవకాశాన్ని మాత్రం పూర్తిగా ఖండించలేదు.

    ఉద్ధవ్, రాజ్ ఇద్దరూ సోదరులని, వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని పేర్కొన్నారు. మళ్లీ కలిసి పనిచేయాలన్న ఆలోచన వారు స్వయంగా చేసుకోవాల్సిన విషయమని రౌత్ తెలిపారు.

    ఇటీవల చిత్రదర్శకుడు మహేష్ మంజ్రేకర్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజ్ ఠాక్రే.. "నేను ఉద్ధవ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం, కానీ ఆయన సిద్ధమా అన్నదే ప్రశ్న అని వ్యాఖ్యానించారు.

    అనంతరం ఉద్ధవ్ స్పందిస్తూ.. బీజేపీ సహకారంలో మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తుల నుంచి రాజ్ దూరంగా ఉండాలని సూచించారు.

    ఈ ప్రకటనలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఠాక్రే సోదరుల కలయికపై చర్చలు మళ్లీ జోరుగా నడుస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు  భారతదేశం
    Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు భారతదేశం
    Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి రైలు ప్రమాదం
    Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం.. భారతదేశం

    ఇండియా

     MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం హైదరాబాద్
    New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట దిల్లీ
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి! తెలంగాణ
    TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం! తిరుమల తిరుపతి దేవస్థానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025