ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడానికి దిల్లీ కోర్టు గురువారం అనుమతించింది.
ఈ కేసులో అప్రూవర్గా మారిన రెండవ వ్యక్తి శరత్ చంద్రారెడ్డి కావడం గమనార్హం. గత నవంబర్లో మద్యం వ్యాపారి దినేష్ అరోరా అప్రూవర్గా మారారు.
ఈ కేసులో ఇటీవల చంద్రారెడ్డిపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇది మరింత ఇబ్బంది పెట్టే పరిణామంగా మారనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అప్రూవర్గా మారేందుకు దిల్లీ కోర్టు అనుమతి
A #Delhi court allowed Sharath Chandra Reddy of Aurbindo Group, an accused in Delhi excise policy scam case, to turn an approver in the case being probed by the Enforcement Directorate (#ED).#DelhiExcisePolicyCase pic.twitter.com/JmvCJ8u3H3
— IANS (@ians_india) June 1, 2023