LOADING...
Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల కోసం తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మరియు మైనార్టీ విభాగానికి చెందిన అధికారితో కూడిన ప్రత్యేక బృందాన్ని వెంటనే సౌదీకి పంపేలా సూచించారు. చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు మత సంప్రదాయాన్ని అనుసరించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదనంగా, ప్రతి కుటుంబానికి ఇద్దరు సభ్యులను తీసుకెళ్ళేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.