NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 
    తదుపరి వార్తా కథనం
    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.

    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వేసిన క్వాష్ పిటిషన్‌‌ను సోమవారం మెన్షన్ చేశారు.

    అయితే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కారణంగా, పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పందించింది.

    చంద్రబాబు ఎప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, క్వాష్ పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేర్చుతామన్నారు.

    ఫలితంగా ఈ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు అన్న విషయం మంగళవారం చెప్పనున్నారు. మరోవైపు సోమ, మంగళ, బుధవారం మాత్రమే ఈవారంలో సుప్రీంకు పనిదినాలున్నాయి.

    details

    సెలవుల కారణంగా మళ్లీ వచ్చే సోమవారమే విచారణ

    ఈలోగా క్వాష్ పిటిషన్‌పై విచారించకపోతే, సెలవుల కారణంగా మళ్లీ వచ్చే సోమవారమే విచారణ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి.

    మరోవైపు చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు శని, ఆదివారాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే దాదాపుగా 12 గంటలు ప్రశ్నించారు. ఈ మేరకు రూ.371 కోట్లతో పాటు 30 అంశాలపై సుమారు 120 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

    అయితే షెల్ కంపెనీల ఏర్పాటుపైనా ప్రశ్నలు కురిపించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే లోకేష్‌కి దీనిపైనా ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో చర్చించినట్లు తెలిసింది.

    ఇందుకు సమాధానాలు చెప్పేందుకు చంద్రబాబు సహకరించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో మరోసారి కస్టడీ కోరారు.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు

    సుప్రీంకోర్టు

    మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు  రాహుల్ గాంధీ
    జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం జ్ఞానవాపి మసీదు
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సెబీ
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట  వనమా వెంకటేశ్వరరావు

    చంద్రబాబు నాయుడు

    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ  ఆంధ్రప్రదేశ్
    టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి ఆంధ్రప్రదేశ్
    మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు తెలంగాణ
    పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025