చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఇటీవలే అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈనెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, చంద్రబాబు అభ్యర్థనను తొసిపుచ్చుతూ ఇవాళ తీర్పు వెలువరించింది.