NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
    తదుపరి వార్తా కథనం
    తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
    చంద్రబాబు రిమాండ్ ఈనెల 24 వరకు పొడిగింపు

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 22, 2023
    12:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించింది.

    ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును, న్యాయమూర్తి వర్చువల్ గా విచారించారు.

    ఉదయం 10 గంటల 30 నిమిషాలకు, జైలు అధికారులు చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇదే సమయంలో మాట్లాడేందుకు చంద్రబాబుకు అవకాశం కల్పించారు.

    దీంతో మాట్లాడిన బాబు, అన్యాయంగా తనను ఇరికించారని, తన తప్పేమీ లేదని స్వయంగా న్యాయమూర్తికి వాదన వినిపించుకున్నారు.

    DETAILS

    కేసులో నా ప్రమేయం లేకున్నా అరెస్ట్ చేశారు : చంద్రబాబు

    ఈ మేరకు కేసులో తన ప్రమేయం లేకుండానే అరెస్ట్ చేశారని, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

    చంద్రబాబు నాయుడు, వాదనలను ఆసాంతం విన్న జడ్జి, విచారణలో అన్ని విషయాలు స్పష్టం అవుతాయని బదులిచ్చారు.

    చట్టం, న్యాయం అందరికీ సమానమేనని, ప్రస్తుతం ఈనెల 24 వరకు రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

    తొలుత అరెస్టయ్యాక చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

    రిమాండ్ గడువు నేటితో ముగియటంతో ఇవాళ మరోసారి విచారణ చేసిన న్యాయమూర్తి, రెండు రోజుల రిమాండ్ కు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఆంధ్రప్రదేశ్

    NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి నందమూరి తారక రామారావు
    AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు  పార్వతీపురం మన్యం జిల్లా
    Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం భారతదేశం
    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025