NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం
    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం

    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 21, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

    శుక్రవారం ఉదయం 10.30గంటలకు తుది నిర్ణయం వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో తీర్పు వాయిదా పడినట్టు తెలుస్తోంది.

    శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకుంతే మాత్రం తీర్పు వెలువరిస్తామన్నారు.

    అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో ఏపీ సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారించనున్నట్లు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

    DETAILS

    ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రేపటికి వాయిదా

    ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబును విచారించేందుకు కస్టడీ అక్కర్లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.

    ఇదే సమయంలో 5 రోజుల కస్టడీని కోరిన సీఐడీ పిటిషన్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు.

    పోలీస్ కస్టడీ పేరిట విచారణ చేపట్టి, ఆయా వివరాలను ఎంపిక చేసుకున్న ఛానెళ్లతో ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

    చంద్రబాబు ప్రతిష్ఠను ప్రజల్లో దెబ్బతీసే లక్ష్యంతోనే దర్యాప్తు సంస్థ ఉవ్విళ్లూరుతోందన్నారు.

    వాస్తవాలు వెలికితీయాలంటే పోలీస్ కస్టడీలో విచారణ అవసరమని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయయూర్తి ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    చంద్రబాబు నాయుడు

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ  వై.ఎస్.జగన్
    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం సుప్రీంకోర్టు
    NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి నందమూరి తారక రామారావు
    AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు  పార్వతీపురం మన్యం జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025