NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 
    భారతదేశం

    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 18, 2023 | 12:10 pm 0 నిమి చదవండి
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు

    వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, లావోస్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నిపుణుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్ చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందువల్లే ఏప్రిల్ 18న ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 44డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే థాయ్‌లాండ్‌లోని తక్ సిటీలో 45.4డిగ్రీలు, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పదేళ్ల గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. లావోస్‌లోని సిన్యాబులిలో ఏప్రిల్ 19న ఆల్ టైమ్ హై ఉష్ణోగ్రతలు 42.9డిగ్రీలుగా రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత వర్షాలు పడటంతో వడదెబ్బ కేసులు సడన్‌గా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు.

    ముంబైలో వడగాలులకు 13మంది మృతి

    ఏప్రిల్ చివరి రెండు వారాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వచ్చిన వడగాలుల వల్ల ఒక్క ముంబైలోనే దాదాపు 13మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఇంకా ఎక్కువనే ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, లావోస్‌లో కూడా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వందల మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే మానవ తప్పిదాల కారణంగా సంభవించిన వాతావరణ మార్పుల వల్లే ఉష్ణోగ్రతలు, వేడిగాలలు పెరిగాయి. భారత్‌తో పాటు మిగతా మూడు దేశాల్లో తేమ వేడి తరంగాల తీవ్రత సాధారణం కంటే 30రేట్లు ఎక్కువగా నమోదైనట్లు నిపుణుల బృందం పేర్కొంది.

    వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు 

    శాస్త్రవేత్తల బృందంలో 22దేశాల ప్రతినిధులతో పాటు తిరుపతి ఐఐటీ, దిల్లీ ఐఐటీ, ముంబై ఐఐటీ, అరులలన్ ఐఎండీ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పులు తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయని వెల్లడించారు. మామూలు వర్షాలు కురిసినట్లు వడగళ్ల వానలు కురవడమే కాకుండా, సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణుల బృందం పేర్కొంది. సాధారణంగా వడగళ్ల తుపానులు పదేళ్లకోసారి సంభవిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఐదేళ్లకోసారి అవకాశం ఉంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా రెండేళ్లకోసారి వడగళ్ల ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వాతావరణ మార్పులు
    ఉష్ణోగ్రతలు
    భారతదేశం
    థాయిలాండ్
    బంగ్లాదేశ్
    తాజా వార్తలు

    వాతావరణ మార్పులు

    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ  ఐక్యరాజ్య సమితి
    ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం సూర్యుడు
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్

    ఉష్ణోగ్రతలు

    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే ఐఎండీ
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  దిల్లీ
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి వేసవి కాలం

    భారతదేశం

    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  అమెరికా
    డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ టీకా
    భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్  ఎలాన్ మస్క్

    థాయిలాండ్

    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు భారతదేశం
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు

    బంగ్లాదేశ్

    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్ ఐర్లాండ్
    మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా? ఐసీసీ

    తాజా వార్తలు

    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు విమానం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023