NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 
    తదుపరి వార్తా కథనం
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు

    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

    వ్రాసిన వారు Stalin
    May 18, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.

    ఏప్రిల్‌లో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, లావోస్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నిపుణుల బృందం వెల్లడించింది.

    ముఖ్యంగా ఏప్రిల్ చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

    అందువల్లే ఏప్రిల్ 18న ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 44డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

    అలాగే థాయ్‌లాండ్‌లోని తక్ సిటీలో 45.4డిగ్రీలు, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పదేళ్ల గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.

    లావోస్‌లోని సిన్యాబులిలో ఏప్రిల్ 19న ఆల్ టైమ్ హై ఉష్ణోగ్రతలు 42.9డిగ్రీలుగా రికార్డయ్యాయి.

    ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత వర్షాలు పడటంతో వడదెబ్బ కేసులు సడన్‌గా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు.

      వడగాలులు

    ముంబైలో వడగాలులకు 13మంది మృతి

    ఏప్రిల్ చివరి రెండు వారాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వచ్చిన వడగాలుల వల్ల ఒక్క ముంబైలోనే దాదాపు 13మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

    అనధికారికంగా ఇంకా ఎక్కువనే ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, లావోస్‌లో కూడా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి.

    వందల మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే మానవ తప్పిదాల కారణంగా సంభవించిన వాతావరణ మార్పుల వల్లే ఉష్ణోగ్రతలు, వేడిగాలలు పెరిగాయి.

    భారత్‌తో పాటు మిగతా మూడు దేశాల్లో తేమ వేడి తరంగాల తీవ్రత సాధారణం కంటే 30రేట్లు ఎక్కువగా నమోదైనట్లు నిపుణుల బృందం పేర్కొంది.

    వడగాలులు

    వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు 

    శాస్త్రవేత్తల బృందంలో 22దేశాల ప్రతినిధులతో పాటు తిరుపతి ఐఐటీ, దిల్లీ ఐఐటీ, ముంబై ఐఐటీ, అరులలన్ ఐఎండీ శాస్త్రవేత్తలు ఉన్నారు.

    వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పులు తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయని వెల్లడించారు.

    మామూలు వర్షాలు కురిసినట్లు వడగళ్ల వానలు కురవడమే కాకుండా, సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణుల బృందం పేర్కొంది.

    సాధారణంగా వడగళ్ల తుపానులు పదేళ్లకోసారి సంభవిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఐదేళ్లకోసారి అవకాశం ఉంది.

    కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా రెండేళ్లకోసారి వడగళ్ల ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ మార్పులు
    ఉష్ణోగ్రతలు
    భారతదేశం
    థాయిలాండ్

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    వాతావరణ మార్పులు

    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం దిల్లీ
    భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం భారతదేశం
    మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు

    ఉష్ణోగ్రతలు

    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    భారతదేశం

    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    ఏప్రిల్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్

    థాయిలాండ్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025