Page Loader
Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు.. నాగోల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయ మార్గానికి సీఎం ఆమోదం 
మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు

Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు.. నాగోల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయ మార్గానికి సీఎం ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు తుది రూపం పొందాయి. మొత్తం ఆరు కారిడార్లలో ఐదు కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు)కు చివరి మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గ నిర్మాణానికి రూ. 32,237 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విమానాశ్రయానికి అనుసంధానం కోసం వివిధ మార్గాలను పరిశీలించినప్పటికీ, నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మార్గానికి సీఎం ఆమోదం ఇచ్చారు.

వివరాలు 

హెచ్‌ఎండీఏ పరిధిలో 'కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌' 

అలాగే, విమానాశ్రయం నుంచి అవుటర్ రింగ్ రోడ్, రావిర్యాల మీదుగా ఫోర్త్‌సిటీకి మెట్రో రైలును కలపాలని నిర్ణయించి, ఈ ప్రాజెక్టును రెండో దశలో భాగంగా చేర్చారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ట్రాఫిక్ అంచనాలకు సంబంధించి హెచ్‌ఎండీఏ పరిధిలో 'కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌' (CMP) అధ్యయన నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ CMP నివేదిక లేకుండా డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేమని స్పష్టం చేశారు. మొత్తం ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ.24,237 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ముందుగా, కేంద్రానికి ఈ ఐదు కారిడార్ల డీపీఆర్‌లను సమర్పించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.

వివరాలు 

కేంద్రానికి ఫోర్త్‌సిటీ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌

రావిర్యాల మీదుగా ఫోర్త్‌సిటీ మెట్రో అనుసంధానానికి ప్రత్యేక ఆకర్షణీయ డీపీఆర్‌ రూపొందిస్తున్నామని, దానికి సుమారు రూ.8,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందాక కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఇప్పటికే మెట్రో రైలు మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సేవలను అందిస్తోంది. అలాగే 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు.