NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు
    తదుపరి వార్తా కథనం
    Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు
    టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు

    Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2024
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సచివాలయం భద్రత మరోసారి తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) ఆధీనంలోకి వచ్చింది.

    ఇప్పటి వరకు భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) నుంచి ఈ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    సీఎస్‌ శాంతికుమారి బుధవారం ఈ మేరకు స్పష్టం చేసింది. సచివాలయ భద్రతా వ్యవహారాలను టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించామన్నారు.

    టీజీఎస్పీఎఫ్‌ కమాండెంట్‌ దేవీదాస్‌ను ప్రధాన భద్రతాధికారిగా నియమిస్తూ ఎస్పీఎఫ్‌ డీజీ అనిల్‌కుమార్‌ వెల్లడించారు.

    దేవీదాస్ నేతృత్వంలో మొత్తం 212 మంది సిబ్బందిని కేటాయించారు. వారు గస్తీ, సాయుధ గార్డులుగా విధులు నిర్వర్తిస్తారు. నవంబరు 1 నుండి కొత్త విధులు ప్రారంభమవుతాయి.

    Details

    విభాగం ఆవశ్యకత, చరిత్ర ఇదే

    ఇప్పటివరకు ఉన్నట్లుగానే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీం (క్యూఆర్టీ) సదరు విధులు కొనసాగిస్తారు. కొత్తగా శిక్షణ పొందుతున్న ఎస్పీఎఫ్‌ సిబ్బందిలోని మరో 100 మందిని త్వరలో సచివాలయ భద్రతకు సమకూర్చనున్నారు.

    సచివాలయం ప్రారంభమైనప్పుడు ఈ బాధ్యతలు ఎస్పీఎఫ్‌ వద్దే ఉన్నాయి. తర్వాత టీజీఎస్పీకి అప్పగించారు. అయితే, తాజా ప్రభుత్వం భద్రతను పూర్తిగా ఎస్పీఎఫ్‌కే అప్పగించాలని నిర్ణయించింది.

    టీజీఎస్పీ సిబ్బంది వ్యతిరేకించినా, భద్రతకు నిబద్ధంగా ఉన్న ఎస్పీఎఫ్‌ మార్పు క్రమాన్ని పునరుద్ధరించడం ప్రాధాన్యంగా మారింది.

    ఈ మార్పు పాత విధానాలను పునరుద్ధరిస్తూ, భద్రతా వ్యవస్థలో సమగ్రతను తీసుకొచ్చేలా క్రమపద్ధతిలో జరుగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    సచివాలయం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తెలంగాణ

    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు ప్రభుత్వం
    Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క
    Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి
    kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌! భారతదేశం

    సచివాలయం

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం తెలంగాణ
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025