NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన 
    తదుపరి వార్తా కథనం
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన 
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన

    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన 

    వ్రాసిన వారు Stalin
    Aug 12, 2023
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.

    ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కొత్త శాసనాలను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది.

    ఈ మూడు చట్టాలను భర్తీ చేసేందుకు శుక్రవారం లోక్‌సభలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023ను ప్రవేశపెట్టింది.

    సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, న్యాయ మంత్రిత్వ శాఖ, గవర్నర్‌లతో విస్తృత సంప్రదింపుల తర్వాత కేంద్రం ఈ బిల్లులను రూపొందించింది.

    ఐపీసీ

    ఐపీసీ సెక్షన్ 377 రద్దు చేయాలని ప్రతిపాదన 

    కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రతిపాదించిన వాటిలో ఐపీసీ సెక్షన్ 377 కూడా ఉంది.

    ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో శారీరక సంబంధం కలిగి ఉంటే ఈ సెక్షన్ ప్రకారం పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

    అలాగే జరిమానా కూడా విధిస్తారు. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మగవారు, ఆడవారు అసహజమైన లైంగిక నేరాలకు ఎలాంటి శిక్ష ఉండదు.

    కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 377 సెక్షన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మొదటి నుంచి స్వలింగ సంపర్కాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే చట్టాన్ని సవరించేందుకు ముందుకొచ్చింది.

    ఐపీసీ

    మహిళలను మోసం చేస్తే 10ఏళ్ల జైలు శిక్ష

    మహిళలపై నేరాలను అరికట్టేందుకు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) బిల్లును కేంద్రం ప్రతిపాదించింది.

    ఈ బిల్లు ద్వారా వివాహం, పదోన్నతి, ఉద్యోగం అనే తప్పుడు వాగ్దానంతో గుర్తింపును దాచిపెట్టి, మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకొని వివాహం చేసుకోవడాన్ని ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది.

    ఈ బిల్లు ప్రకారం నేరం రుజవైతే 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. వ్యభిచారం నిబంధనల్లో కూడా మార్పులను కేంద్రం ప్రతిపాదించింది.

    మహిళలపై నేరాలు, వారు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించారు.

    భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు 9నిబంధనలను రద్దు చేయాలని సూచించింది.

    భారతీయ సాక్షా బిల్లు ఐదింటిని రద్దు చేయాలని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని కేంద్రం కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    భారతదేశం
    కేంద్ర ప్రభుత్వం
    అమిత్ షా

    తాజా

    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్

    లోక్‌సభ

    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ! కర్ణాటక
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  ఎన్నికలు

    భారతదేశం

    2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్  అమెరికా
    వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా ఐఎండీ
    త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్  ఐఫోన్
    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  రక్షణ

    కేంద్ర ప్రభుత్వం

    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి
    నల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు ప్రధాన మంత్రి
    ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రచార ఉద్యమం..ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేయనున్న ఆప్ ప్రపంచం

    అమిత్ షా

    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025