తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    May 09, 2025 
                    
                     11:52 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను సమీక్షించేందుకు జిల్లా పోలీసు అధికారి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమలలోని సీవీఎస్వో కార్యాలయంలో జరిగింది. భద్రతా పటిష్ఠతను మరింతగా పెంచుతూ, మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు